Nov 20,2023 19:52

మాట్లాడుతున్న మున్సిపల్‌ ఛైర్మన్‌ శాంత

ప్రజాశక్తి - ఆదోని
అన్ని అంశాలకూ సంబంధించిన పుస్తకాలు ఉన్న గ్రంథాలయాలు విజ్ఞాన నిలయాలని ముఖ్యఅతిథులు మున్సిపల్‌ ఛైర్మన్‌ శాంత, చిన్మయ విద్యాలయ పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుస్మిత, నెహ్రూ మెమోరియల్‌ ఇన్‌ఛార్జీ రామయ్య, విశ్రాంత ప్రధానోపాధ్యాయులు దేవప్రసాద్‌ తెలిపారు. సోమవారం ప్రథమ శ్రేణి గ్రంథాలయ అధికారిణి కె.సుజాత అధ్యక్షతన ఆదోని గ్రంథాలయంలో వారోత్సవాల ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించారు. విజ్జానాన్ని పెంపొందించుకునేందుకు, పోటీ పరీక్షల అభ్యర్థులు గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం విద్యార్థులకు బహుమతులు అందజేశారు. పాఠకులు పాల్గొన్నారు.