Oct 25,2023 21:43

ఎపిఎస్‌ఎస్‌డిసి చైర్మన్‌కు నేదురుమల్లి అభినందనలు


ఎపిఎస్‌ఎస్‌డిసి చైర్మన్‌కు నేదురుమల్లి అభినందనలు
ప్రజాశక్తి-వెంకటగిరి: రెండవసారి ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఏపిఎఎస్‌డిసి చైర్మన్‌గా నియమితులయిన కొండూరు అజరురెడ్డిని బుధవారం విజయవాడలో తిరుపతి జిల్లా వైసిపి అధ్యక్షులు, వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా యువత మెరుగైన ఉపాధి అవకాశాలు పొందేలా ఏపిఎఎస్‌డిసి ఆధ్వర్యంలో శిక్షణపై అవగాహన మరింత విస్తృతం చేసేలా అజరురెడ్డి కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.