అమరావతి : ఆంధ్రప్రదేశ్లో పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపుపై విచారణ వాయిదాపడింది. బుధవారం ఈ అంశంపై విచారణ చేపట్టిన హైకోర్టు తదుపరి విచారణను ఆగస్టు 4 వ తేదీకి వాయిదా వేసింది. సుప్రీం కోర్టు ఆదేశాలను పాటించకుండా ఎన్నికలు నిర్వహించారంటూ ఎపి హైకోర్టు సింగిల్ బెంచ్ ఓట్ల లెక్కింపును రద్దు చేసింది. ఈ ఆదేశాలపై ఎపి ఎన్నికల సంఘం డివిజన్ బెంచ్ను ఆశ్రయించింది. నేడు దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు వాయిదా వేయడంతో ప్రతిష్టంభన కొనసాగినట్లయింది.