ధనుష్ ఎంపికపై హర్షం
ప్రజాశక్తి-సీతారామపురం : నేషనల్ బిజినెస్ ఎక్సిలెన్స్ 2023 అవార్డుకు ఉదయగిరి టిడిపి యువనేత పారిశ్రామికవేత్త బొల్లినేని ధనుష్ ఎంపిక కావడంపై మండల టిడిపి కన్వీనర్ కప్పా ప్రభాకర్రాజు హర్షం వ్యక్తం చేశారు. గ్లోబల్ ఇండియా బిసినెస్ ఫోరమ్ ఆధ్వర్యంలో నోవోటెల్ హౌటల్లో శనివారం నిర్వహించిన నేషనల్ బిజినెస్ ఎక్సిలెన్స్ 2023, అవార్డుల ప్రదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. నేషనల్ బిజినెస్ ఎక్సిలెన్స్ 2023, అవార్డులకు ఎంపికైన బొల్లినేని ధనుష్ను అభినందిస్తూ గవర్నర్ అవార్డును ప్రదానం చేశారు. నేషనల్ బిజినెస్ ఎక్సిలెన్స్ 2023, అవార్డులకు ఎంపికైన బొల్లినేని ధనుష్కు మండలానికి చెందిన పలువురు టిడిపి నేతలు, అభిమానులు అభినందనలు తెలిపారు. ఉదయగిరి నియోజకవర్గానికి చెందిన ధనుష్ ఈ అవార్డుకు ఎంపికవడం ఈ ప్రాంత ప్రజలుగా తమకు తమ ప్రాంతానికి గర్వకారణంగా ఉందని నియోజకవర్గ యువత హర్షం వ్యక్తం చేస్తున్నారు.










