విజయవాడ : ఢిల్లీ రైతులకు మద్దతుగా.. ఎస్ఎఫ్ఐ విజయవాడ నగర కమిటీ ఆధ్వర్యంలో సోమవారం నిధి సేకరణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ప్రసన్నకుమార్, జిల్లా కార్యదర్శి సోమేశ్వరరావు, నగర నాయకులు దినేష్, వంశీ, రాధాకఅష్ణ, ప్రవీణ్, నరేంద్ర, ధీరజ్, రభాని, ప్రసాద్, అభిషేక్, రిజ్వాన్, సుమంత్, పూజ, తదితరులు పాల్గొన్నారు.
మరోవైపు.. వన్ టౌన్ కెబిఎన్ కాలేజీ సెంటర్ వద్ద రైతు సంఘీభావ సహాయ నిధిని సేకరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు పశ్చిమ నగర కమిటీ కోశాధికారి బాబు ఖాన్, బాలల సంఘం చిన్నారులు పాల్గొన్నారు.