ప్రజాశక్తి - మంత్రాలయం
మండలంలోని సూగూరు గ్రామానికి చెందిన దళిత గర్జి సురేష్ అదృశ్యంపై సురేష్ తల్లి ఉలిగమ్మ ఫిర్యాదు చేశారు. శుక్రవారం జైభీమ్ ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షులు గాడి మోడీ నరసింహులు ఆధ్వర్యంలో స్థానిక పోలీసు స్టేషన్లో ఎస్ఐ వేణుగోపాల్ రాజుకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా జై భీమ్ ఎంఆర్పిఎస్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు చిక్కం జానయ్య మాదిగ మాట్లాడారు. మంత్రాలయం మండలం సూగూరు గ్రామానికి చెందిన గర్జి సురేష్ గత 25 రోజుల నుంచి కనిపించడం లేదని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. పోలీసులు సురేష్ ఆచూకీని కనిపెట్టి తల్లికి అప్పగించాలని కోరారు. జై భీమ్ ఎంఆర్పిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి గర్జి హనుమన్న మాదిగ, మంత్రాలయం నియోజకవర్గ నాయకులు దేవరపాటి అనిల్ కుమార్, కందనాతి మారెప్ప, సూగూరు గ్రామ పెద్దలు గర్జి దేవదాసు, గర్జి గోపి, గర్జి నాగప్ప, గర్జి ఆనంద్, గర్జి శివారెడ్డి, గర్జి సుజ్ఞానం, గర్జి బుడ్డన్న, గర్జి సామ్యేల్ పాల్గొన్నారు.
పోలీసులకు ఫిర్యాదు చేస్తున్న తల్లి