Oct 19,2023 11:03

ప్రజాశక్తి-ఆదోని : సిఎం జగన్ నేడు కర్నూల్ జిల్లా పర్యటన నేపథ్యంలో జిల్లాలో పలుచోట్ల పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. ఈ సందర్భంగా పోలీసుల చేత ప్రశ్నించే వారి గొంతు నొక్కించడం సీఎం జగన్మోహన్ రెడ్డికి పరిపాటిగా మారిందని టిడిపి మాజీ ఇన్చార్జి గుడిసె ఆదికృష్టమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం తెల్లవారుజామున ఆమె ఇంటికి వెళ్లి బయటకు రాకుండా త్రీ టౌన్ పోలీసులు నిర్బంధించారు. ఈ సందర్భంగా గుడిష ఆది కృష్ణ మాట్లాడారు. గత ఏడాది సెప్టెంబర్ 5న ఆదోని పర్యటన వచ్చిన సీఎం జగన్మోహన్ రెడ్డి రోడ్లు వెడల్పు కాలేజీ ఏర్పాటు ముస్లింలకు ఈద్గా ఏర్పాటుకు నిధులు కేటాయిస్తామని ప్రకటన చేసిన ఇంతవరకు అమలు కాలేదన్నారు. సీఎం పర్యటన వల్ల ఈ ప్రాంతానికి ఎలాంటి మేలు జరగడం లేదన్నారు. తాము ఎలాంటి ఆందోళన చేయబోమని చెబుతున్నప్పటికీ పోలీసుల చేత నిర్బంధించడం తగదన్నారు.

  •  అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు

ఆదోని పట్టణంలోని ఎస్ఎఫ్ఐ పట్టణ కార్యదర్శి శ్రీనివాసులను బుధవారం రాత్రి వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం ఎమ్మిగనూరులో సీఎం జగన్ పర్యటన సందర్భంగా పోలీసులు ప్రజా,విద్యార్థి సంఘాల నాయకులను ముందస్తుగా అదుపులోకి తీసుకొని నిర్బంధించడం సమంజసం కాదంటూ నాయకులు తెలిపారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా సీఎం జగన్ పర్యటన చేయడం ఏమిటని శ్రీనివాసులు పేర్కొన్నారు. అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని పోలీసులు తీరు మారాలన్నారు జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా ఎలాంటి ఆవాంఛనీయ ఘటనలు జరగకుండా టిడిపి, వామపక్ష, ప్రజా, విద్యార్థి సంఘాల నాయకులను ముందస్తుగా అరెస్టు చేశామని డిఎస్పి శివ నారాయణ స్వామి గురువారం ఆదోనిలో తెలిపారు. ఎమ్మిగనూరులో సీఎం సభ జరుగుతున్న నేపథ్యంలో తెల్లవారుజామున ఇళ్లకు చేరుకొని బయటకు రాకుండా పోలీసులు నిర్బంధించడం ఎంతవరకు సమంజసం అంటూ నాయకులు అభ్యంతర వ్యక్తం చేశారు.