Jul 26,2021 11:12

కౌలాలంపూర్‌ : కరోనా సోకిందని బలవన్మరణానికి పాల్పడ్డారు తల్లి కుమార్తెలు. ఈ విషాద ఘటన మలేషియాలో చోటుచేసుకుంది. తమిళనాడుకు చెందిన రవిరాజా కుటుంబం మలేషియాలో 12 ఏళ్లుగా జీవిస్తుంది. రవిరాజా కంప్యూటర్‌ ఇంజనీర్‌ . ఇటీవల రవిరాజాతో పాటు భార్య సత్య, కుమార్తె గుహదరాణిలకు కరోనా సోకింది. రవిరాజాకు ఆరోగ్యం విషమించడంతో ఆసుపత్రిలో చేరారు. తల్లి, కుమార్తె హోం ఐసోలేషన్‌లో ఉంటున్నారు. అయితే ఇంట్లో ఇద్దరే ఉండటంతో ఆత్మనూన్యతకు లోనైన తల్లి, కుమార్తెలు నాలుగు రోజుల క్రితం మేడపై నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషయం రవిరాజాకు తెలియడంతో..కరోనాకు చికిత్స పొందుతూనే శనివారం సాయంత్రం ప్రాణాలు విడిచారు. రవిరాజా బంధువులు మాట్లాడుతూ మఅతదేహాలను ఇవ్వడానికి మలేషియా ప్రభుత్వం తిరస్కరించిందని, భారత ప్రభుత్వం అనుమతిస్తే వారి అస్తికలు పంపేందుకు ఏర్పాట్లు చేస్తామని తెలిపారన్నారు. భారత రాయబార కార్యాలయం చర్చలు జరిపి అస్తికలు సొంత గ్రామానికి వచ్చేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు.