Nov 10,2023 20:49

మంత్రాలయంలో ప్రజలకు వివరిస్తున్న శ్రీనివాస్‌ రెడ్డి

ప్రజాశక్తి - మంత్రాలయం
రాష్ట్రంలో ప్రజలకు సంక్షేమంతో అభివృద్ధి పనులు జరిగాలంటే చంద్రబాబుతోనే సాధ్యమని టిడిపి రాష్ట్ర కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు. శుక్రవారం మండలంలోని చిలుకలడోన గ్రామంలో క్లస్టర్‌ ఇన్‌ఛార్జీ ఎల్లా రెడ్డి, మాజీ సర్పంచి హనుమంతు ఆధ్వర్యంలో 'బాబు ష్యూరిటీ, భవిష్యత్తుకు గ్యారెంటీ' నిర్వహించారు. ఇంటింటికీ తిరిగి టిడిపి అధికారంలోకి వస్తే చేపట్టే సంక్షేమ పథకాలకు వివరించారు. రానున్న ఎన్నికల్లో టిడిపికి ఓటు వేసి చంద్రబాబును ముఖ్యమంత్రిగా, ఎమ్మెల్యేగా తిక్కారెడ్డిని గెలిపించాలని కోరారు. మాజీ సర్పంచి హనుమంతు, తిక్కయ్య, ఈరన్న, శివరాం, రంగన్న, ఆంజనేయ, ఎల్లప్ప, తోక హనుమంతు, రామకృష్ణ పాల్గొన్నారు. పెద్దకడబూరు మండలం మురవణి గ్రామంలో 'బాబు ష్యూరిటీ, భవిష్యత్తుకు గ్యారెంటీ' నిర్వహించారు. టిడిపి ఇన్‌ఛార్జీ తిక్కారెడ్డి తనయుడు, తెలుగు యువత జిల్లా ప్రధాన కార్యదర్శి పాలకుర్తి దివాకర్‌ రెడ్డి ఇంటింటికీ వెళ్లి టిడిపి అధికారంలోకి వస్తే చేపట్టే సంక్షేమ పథకాల గురించి వివరించారు. సత్యన్న గౌడ్‌, లారీల రంగన్న, చంటోడు, ఎంపిటిసి జాన్‌, సురేష్‌, యోహాన్‌, చెన్నకేశవులు, దస్తగిరి, నరసయ్య, తెలుగు యువత చెన్నకేశవ, వీరేష్‌ పాల్గొన్నారు.

పెద్దకడబూరులో ప్రజలకు వివరిస్తున్న దివాకర్‌ రెడ్డి
పెద్దకడబూరులో ప్రజలకు వివరిస్తున్న దివాకర్‌ రెడ్డి