Nov 20,2023 23:32

గుంటూరులో బాణసంచా కాలుస్తున్న టిడిపి నాయకులు డాక్టర్‌ నిమ్మల శేషయ్య

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి, తెనాలి : టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకు హైకోర్టు సోమవారం సాధారణ బెయిల్‌ మంజూరు చేయడంతో టిడిపి శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. బాణసంచా కాల్చి మిఠాయిలు పంచుకున్నాయిు. గుంటూరులోని తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల ఇన్‌చార్జులు కోవెలమూడి రవీంద్ర, నశీర్‌ అహ్మద్‌, నగర అధ్యక్షులు డేగల ప్రభాకర్‌ సంబరాల్లో పాల్గొన్నారు. సీనియర్‌ నాయకులు నిమ్మల శేషయ్య ఆధ్వర్యంలో గుజ్జనగుండ్ల సెంటర్‌లో టపాసులు కాల్చారు. తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ ఆధర్యంలో బాణసంచా కాల్చారు. తెనాలి పట్టణం కొత్తపేటలోని టిడిపి కార్యాలయం నుంచి నాయకులు పట్టణంలో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీగా మార్కెట్‌ కూడలిలోని ఎన్టీఆర్‌ విగ్రహం వద్దకు చేరుకొని నివాళులర్పించారు. భారీ కేక్‌ కట్‌ చేసి అభిమానులకు పంచారు. కార్యక్రమంలో టిడిపి పట్టణ అధ్యక్షులు టి.హరిప్రసాద్‌, నాయకులు మహమ్మద్‌ ఖుద్దూస్‌, కనక రాంబాబు, కె.శ్రీనివాసరావు, డాక్టర్‌ వి.శేషగిరిరావు, ఆర్‌.చిన్ని, జె.మహేష్‌, కె.రమాదేవి, బి.అరుణ, డి.అనిత పాల్గొన్నారు.