Nov 22,2023 00:03

ప్రజాశక్తి వేటపాలెం
రాష్ట్ర ప్రభుత్వం అరాచకాలకు చమర గీతం పాడే రోజులు దగ్గర పడ్డాయని టిడిపి నాయకులు సజ్జా వెంకటేశ్వరరావు అన్నారు. చంద్రబాబుకు సాధారణ బెయిల్ మంజూరైన సందర్బంగా టిడిపి కార్యకర్తలతో కలిసి ఆనుమల్లిపేట చిన్న బజార్ సెంటర్లో చంద్రబాబు చిత్రపటానికి మంగళవారం పాలాభిషేకం చేశారు. అనంతరం స్వీట్లు పంచి సంబరాలు జరుపుకున్నారు. చంద్రబాబును అక్రమంగా జైల్లో ఉంచి కనీసం చిన్న ఆధారం కూడా చూపలేకపోవడం వైసీపీ ప్రభుత్వం కుట్రలు బయట పెట్టుకుందని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో బుద్ధి రమేష్, షేక్ రఫీ, పింజెల భాస్కరరావు, కరిముల్లా, సజ్జా రవికుమార్, మెట్ల వెంకట సుబ్బారావు, గంజి గాంధీ, బొడ్డు శ్రీనివాసరావు పాల్గొన్నారు