Nov 13,2023 22:39

చెట్టు విరిగి కూలిన విద్యుత్‌ స్తంభం తప్పిన పెను ప్రమాదం

చెట్టు విరిగి కూలిన విద్యుత్‌ స్తంభం
తప్పిన పెను ప్రమాదం

ప్రజాశక్తి - పుత్తూరు టౌన్‌: పుత్తూరు పట్టణంలో ఎన్జీవో కాలనీ ఫారెస్ట్‌ ఆఫీసులోని టెంకాయ చెట్టు ఆదివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో హఠాత్తుగా కూలి విద్యుత్‌ స్తంభంపై పడి విరిగిపోయింది. అదే సమయానికి విద్యుత్‌ లేకపోవడంతో ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో పెనుముప్పు తప్పింది. కాలనీ వాసులు ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదని ప్రజలు వాపోయారు. ఫారెస్ట్‌ ఆఫీసర్‌ వారు కార్యాలయంలో వున్నా చెట్లను పర్యవేక్షించకపోవడమే దీనికి కారణమని ప్రజలు చెబుతున్నారు. ఇకనైనా అధికారులు వారి ఆఫీసు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలను పరివేక్షించాలని వారు కోరారు.