
బ్యాంకు ఉద్యోగుల ధర్నా
ప్రజాశక్తి- తిరుపతి టౌన్
ఆల్ ఇండియా బ్యాంక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బ్యాంకు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గురువారం టిపి ఏరియాలో ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ వద్ద ధర్నా జరిగింది. తిరుపతి బ్యాంక్ ఉద్యోగుల సమన్వయ కమిటీ ప్రధాన కార్యదర్శి ధన్వంత్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ బ్యాంకుల్లో సిబ్బంది నియామకాలు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. పదవి విరమణ చేసిన ఖాళీలను భర్తీ చేయకపోవడం అన్యాయమని చెప్పారు. బ్యాంకుల్లో సిబ్బంది కొరత కారణంగా మెరుగైన సేవలు అందించలేకపోతున్నామని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం బ్యాంకుల్లో ఉద్యోగులు నియామకం వెంటనే చేపట్టాలని కోరారు. ఔట్సోర్సింగ్ నియామకాన్ని వెంటనే ఆపివేయాలని కోరారు. దీనికి నిరసంగా డిసెంబర్ 4 నుంచి 11వ తేదీ వరకు అన్ని బ్యాంకులు వద్ద ఆందోళనలు, ధర్నాలు శాంతియుతంగా చేస్తామని హెచ్చరించారు. ధర్నా కార్యక్రమంలో భాస్కర్, రేష్మ, జనార్ధన్, సుమలత, నిర్మల, నరసింహులు, లక్ష్మీపతి, నందగోపాల్, మహేష్, నవీన్ యోగేష్ బాబు, పవన్ వెంకటరెడ్డి పాల్గొన్నారు.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ వద్ద బ్యాంకు ఉద్యోగుల ధర్నా