Nov 22,2023 00:21

ప్రజాశక్తి - వినుకొండ : వినుకొండ నుంచి మళ్లీ బొల్లా బ్రహ్మనాయుడు పోటీ చేయాలనేదే తన కోరికని, ఆయన్ను బంగాళాఖాతంలో కలి పేందుకు వైసిపి నాయకులు కూడా తహ తహ లాడుతున్నారని టిడిపి జిల్లా అధ్యక్షులు జీవీ ఆంజనేయులు దుయ్యబ ట్టారు. బొల్లాపల్లి మండలంలోని లక్ష్మీపురం తండా, మాలపాడు గ్రామాల్లో బాబు ష్యురిటి భవిష్యత్తుకు గ్యారెంటి కార్యక్ర మాన్ని మంగళవారం నిర్వహించగా జీవీ ఆంజనేయులు పాల్గొని టిడిపి, జనసేన ఉమ్మడిగా రూపొందించిన కరపత్రాలను స్థానికులకు అందించారు. బొల్లా బ్రహ్మనాయుడు పాల్పడిన అవినీతి, మోసాలు, జాలలపాలెం వద్ద ప్రభుత్వ భూమిని కబ్జా చేసి దాన్ని ప్రభుత్వానికే రూ.18 కోట్లకు అమ్మిన వైనం అంతా ప్రజలకు తెలుసన్నారు. ఒక్క బొల్లాపల్లి మండలంలోనే పట్టాదారు పాస్‌ పుస్తకాలు తహశీల్దార్‌ను అడ్డం పెట్టుకొని రూ.10 కోట్లకు పైగా కొట్టేశారని ఆరోపించారు. టిడిపి హయాంలో వచ్చిన నిధులు తప్ప ప్రత్యేక నిధులు ఒక్క రూపాయి తీసుకురాక పోగా తాను తెచ్చిన రూ.159 కోట్లతో వినుకొండ తాగునీటి స్కీమ్‌ పూర్తి చేయలే దన్నారు. తంగిరాల డాం నిర్మిస్తానని ప్రగల్బాలు పలికారని, ఆయనకు మరో అవకాశం ఇస్తే నియోజకవర్గాన్ని భూకబ్జాల అడ్డగా చేసుకుంటారనే భయం ప్రజల్లో ఉందని అన్నారు.