Nov 10,2023 20:03

గోడ పత్రికలను విడుదల చేస్తున్న నాయకులు

ప్రజాశక్తి - ఆస్పరి
ఈనెల 15న విజయవాడలో జరిగే ప్రజా రక్షణ భేరి బహిరంగ సభను జయప్రదం చేయాలని సిపిఎం మండల కార్యదర్శి హనుమంతు నాయకులను, కార్యకర్తలను కోరారు. శుక్రవారం స్థానిక సుందరయ్య భవనంలో గోడపత్రికను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించాలని కోరారు. ఖరీఫ్‌లో నష్టపోయిన రైతులకు పరిహారం అందజేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టుకు నిధులు మంజూరు చేయాలని కోరారు. విశాఖ రైల్వే జోన్‌, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు ఇవ్వడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసిపి, ప్రతిపక్షంలో ఉన్న టిడిపి, జనసేన పార్టీలు ప్రశ్నించకుండా బిజెపికి తొత్తుగా వ్యవహరిస్తున్నాయని తెలిపారు. సిపిఎం మండల నాయకులు రంగస్వామి, రామాంజినేయులు, రవి, మల్లి, మురళీ, ముని, రమేష్‌ పాల్గొన్నారు.