Jul 22,2021 18:19

అమరావతి : ఎపిలో గడిచిన గడిచిన 24 గంటల్లో మొత్తం 70,727 కరోనా పరీక్షలు చేయగా.. 1,843 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజా గణాంకాల ప్రకారం మొత్తం కేసుల సంఖ్య రాష్ట్రంలో 19,48,592కి చేరింది. ప్రస్తుతం 23,571 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 2,199 మంది కరోనా నుండి కోలుకున్నారు. దీంతో మొత్తం డిశ్చార్జ్‌ అయిన వారి సంఖ్య 19,11,812కు చేరింది. ఇదే సమయంలో కరోనాతో 12 మంది మృతిచెందారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మరణాల సంఖ్య 13,209కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వివరాలు వెల్లడించింది.