Jul 13,2021 08:49

బెంగాల్‌ : అండమాన్‌ దీవులలో మంగళవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 4.2 గా నమోదయినట్లు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మోలజీ తెలిపింది. మరోవైపు అండమాన్‌ నికోబార్‌ దీవులలో కరోనా వైరస్‌ నెమ్మదించింది. పాజిటివ్‌ కేసులు తగ్గుముఖం పట్టాయి.
     ఇటీవల జూలై 7 న అస్సాంలోని గోల్‌పారాలో కూడా భూకంపం సంభవించింది. నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ దాని పరిమాణాన్ని రిక్టర్‌ స్కేల్‌లో 5.3 గా ఇచ్చింది. మేఘాలయ, పశ్చిమ బెంగాల్‌ లోని కొన్ని ప్రాంతాల్లో కూడా ప్రకంపనలు సంభవించాయి. మేఘాలయలో 5.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. డార్జిలింగ్‌, కూచ్‌ బెహార్‌తో సహా ఉత్తర బెంగాల్‌లోని కొన్ని ప్రాంతాల్లో ప్రకంపనలు సంభవించాయి. రాంబన్‌, దోడా, భదర్వా, కిష్త్వార్‌, పాడార్‌, పూంచ్‌, రాజోరి,జమ్మూ డివిజన్‌లోని కతువా జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలు భూకంపానికి గురయ్యే అవకాశం ఉంది. ఇది కాకుండా కాశ్మీర్‌ డివిజన్‌లోని అన్ని జిల్లాలు సున్నితమైన మండలంలో ఉన్నాయి. గతంలో భూకంపాలు సంభవించిన ప్రాంతాలలో మరోసారి భూకంపాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.