Nov 15,2023 08:29

-పలువుర్ని ఆకట్టుకుంటున్న ప్రచార హోర్డింగ్స్‌
అమరావతి : విజయవాడలో రేపు ఉదయం 11 గంటలకు సింగ్‌ నగర్‌ బసవ పున్నయ్య స్టేడియంలో సీపీఎం నిర్వహిస్తున్న ప్రజారక్షణ భేరి సభకు రాష్ట్రం నలుమూలల నుంచి సిపిఎం నాయకులు, కార్యకర్తలు బస్సు, రైలు, రోడ్డు మార్గాలలో ఇప్పటికే విజయవాడకు బయలు దేరారు. ఇప్పటికే నగరంలో ప్రజా రక్షణ భేరి ప్రచారం నిమిత్తం ఏర్పాటు చేసిన ప్రచార హౌర్డింగ్స్‌ పలువుర్ని ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా రామవరప్పాడు రింగ్‌, బిఆర్‌టీఎస్‌ రోడ్‌, పడవల రేవు, బుడమేరు వంతెన సెంటర్‌, సీతన్న పేట సికె రెడ్డి రోడ్‌, జింఖానా గ్రౌండ్స్‌ వద్ద రోడ్‌, పోలీస్‌ కంట్రోల్‌ రూం వద్ద, కఅష్ణలంక హై వే లో బందరు లాకుల వద్ద ఏర్పాటు చేసిన ప్రచార హౌర్డింగ్స్‌ ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రేపు జరిగే ప్రజారక్షణ భేరికి రెడ్‌ కవాతు ట్రయిల్‌ రన్‌ నిర్వహించారు.

  • తిరుపతి జిల్లా సమాచారం

-నాయుడుపేట 45 మంది రాత్రి 11 గంటలకు,
-సత్యవేడు, పుత్తూరు నుండి 55 మంది ఒకటిన్నర గంటలకి,
-సూళ్లూరుపేట నుండి 70 మంది రెండు గంటలకి
-వెంకటగిరి, అంగనవాడి నుండి నుండి 57 మంది మూడు గంటలకి,
-టీటీడీ నుంచి 13 మంది మూడు గంటలకి,
-తిరుపతి నుండి 174 మంది ఉదయం ఏడు గంటలకి,
-గూడూరు నుండి 150 మంది ఉదయం 10:30 కి
-రేణిగుంట నుంచి 18 మంది ఉదయం ఏడు గంటలకి
-ఆర్టీసీ నుండి 19 మంది బస్సులు ద్వారా ఉదయం 8 గంటలకి
-శ్రీకాళహస్తి నుంచి బస్సు ద్వారా 40 మంది ఉదయం ఐదు గంటలకి చేరుకుంటారు.