Nov 15,2023 15:34

సంగారెడ్డి : కాంగ్రెస్‌కి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ఆ పార్టీ నేతల ఒంటెద్దు పోకడలతో విసిగి చెందిన నాయకులు, కార్యర్తలు ఒక్కొక్కరు ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నారు. తాజాగా పీసీసీ వైస్‌ ప్రెసిడెంట్‌ గాలి అనిల్‌ కుమార్‌ పార్టీకి రాజీనామా చేశారు. ఆయనతో పాటు పది మంది నాయకులు కూడా పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్‌ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేసినా తనకు సరైన గుర్తింపు లభించలేదన్నారు. తాను పార్టీ కోసం పని చేసి అన్ని విధాల నష్టపోయాయని రాజీనామా లేఖలో పేర్కొన్నారు. కార్యకర్తలు, అభిమానుల సూచనమేరకు కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తున్నట్లు అనిల్‌ కుమార్‌ పేర్కొన్నారు.