Oct 03,2023 11:19

అమరావతి : టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఎపి హైకోర్టులో మంగళవారం లంచ్‌మోషన్‌ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఫైబర్‌నెట్‌ కేసుకు సంబంధించి ముందస్తు బెయిల్‌ కోసం లోకేశ్‌ ఈ పిటిషన్‌ వేశారు. దీనిపై ఉన్నత న్యాయస్థానం ఈరోజు మధ్యాహ్నం విచారణ చేపట్టనుంది.