అమరావతి: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో టిడిపి అధినేత చంద్రబాబును పోలీసు కస్టడీకి ఇవ్వాలంటూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్పై విజయవాడ ఏసీబీ కోర్టు తీర్పు వెలువరించింది. చంద్రబాబును రెండ్రోజుల పాటు కస్టడీకి అనుమతిస్తూ ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ లూథ్రా, సిద్ధార్థ్ అగర్వాల్ వాదనలు వినిపించారు. సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్రెడ్డి వాదించారు.










