Nov 15,2023 08:26

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లో సమగ్రాభివృద్ధి కోసం సిపిఎం 'ప్రజా రక్షణ భేరి' యాత్రను చేపట్టింది. అక్టోబర్‌ 30 తేదీన రెండు బస్సు యాత్రలు ప్రారంభమయ్యాయి. పార్వతీపురం సీతానగరం నుండి ఒక బస్సు యాత్ర, కర్నూలు ఆదోని నుండి మరో యాత్ర ప్రారంభమయ్యాయి. సీతానగరం నుండి ప్రారంభమైన బస్సు యాత్ర నవంబర్‌ 8వ తేదికి ముగిసింది. ఇక ఆదోని నుండి ప్రారంభమైన బస్సు యాత్ర నవంబర్‌ 9వ తేదీకి ముగిసింది. మూడో యాత్ర నవంబర్‌ 2వ తేదీ శ్రీకాకుళం మందస నుండి ప్రారంభమైంది. ఈ యాత్ర శుక్రవారానికి కృష్ణాజిల్లా చర్లపల్లికి చేరుకుంది. బుధవారం ఉదయం 10 గంటలకు విజయవాడలోని బిఆర్‌టిఎస్‌ రోడ్డు ఫుడ్‌ జంక్షన్‌ నుండి మహా ప్రదర్శన ప్రారంభమవుతుంది. ఉదయం 11 గంటలకు సింగ్‌నగర్‌లోని ఎంబి.స్టేడియంలో బహిరంగ సభ ప్రారంభం కానుంది. సభాధ్యక్షులుగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు వ్యవహరిస్తారు. సిపిఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సిపిఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బివి.రాఘవులు ప్రసంగించనున్నారు.