Feb 01,2023 21:44

న్యూఢిల్లీ : అదానీ గ్రూపునకు మరో తీవ్ర ఎదురుదెబ్బ తగిలింది. గౌతం అదానీ కంపెనీల బాండ్లపై మార్జిన్‌ రుణాల జారీని నిలిపివేస్తున్నట్లు స్విస్‌కు చెందిన ప్రయివేటు రంగ రుణదాత క్రెడిట్‌ సూస్సె తాజాగా ప్రకటించింది. హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ నుంచి తీవ్ర మోసాల ఆరోపణలు ఎదుర్కొంటున్న అదానీ కంపెనీలకు ఇది మరింత శరఘాతంగా మారింది. ఈ రెండు సంస్థల దెబ్బకు బుధవారం స్టాక్‌ మార్కెట్‌లో అదానీ కంపెనీల షేర్లు పేక ముక్కల్లా కూలాయి. అదానీ పోర్ట్స్‌ అండ్‌ స్పెషల్‌ ఎకనామిక్‌ జోన్‌, అదానీ గ్రీన్‌ ఎనర్జీ, అదానీ ఎలక్ట్రిసిటీ ముంబయి లిమిటెడ్‌ కంపెనీల బాండ్లకు సున్నా విలువను ఇస్తూ క్రెడిట్‌ సూస్సె నిర్ణయం తీసుకుందని.. ఈ వ్యవహారంతో సంబంధం కలిగిన వ్యక్తులు వెల్లడించినట్లు రిపోర్టులు వచ్చాయి. ఇంతక్రితం అదానీ పోర్ట్స్‌ బాండ్లపై 75 శాతం రుణాలు ఇచ్చేవి.