సన్మానిస్తున్న దృశ్యం
22వ తేదిలోగా పెన్షనర్లు లైఫ్ సర్టిఫికేట్లు అందజేయాలి
నెల్లూరు:పెన్షనర్లు అందరూ ఈ నెల 22వ తేదిలోగా తమ లైఫ్ సర్టిఫికేట్లను అందజేయాలని డివిజనల్ సబ్ ట్రెజరీ అసిస్టెంట్ ట్రెజరీ అధికారి పేర్కొన్నారు. సోమవారం రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల అసోసియేషన్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ట్రెజరీ అధికారి ముఖ్యఅతిధిగా హాజరైయ్యారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు ఎస్ఎం గౌస్ మాట్లాడుతూ పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలని జిల్లా అధికారులకు వినతిపత్రం ఈ నెల 9వ తేదిన అందజేశామన్నారు. ముఖ్యంగా పెన్షన్ చెల్లింపులు ట్రెజరీ అధికారుల పరిధిలో ఉంచడం న్యాయమని అధికారులు దృష్టికి తీసుకెళ్లామన్నారు. అనంతరం కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరైన ట్రెజరీ అధికారి మాట్లాడూతు పెన్షనర్లు తమ లైఫ్ సర్టిఫికేట్ అందజేయడం అలస్యం అయితే మేనెల పెన్షన్ నిలిపిపోతుందన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర సంఘం వైస్ ప్రెసిడెంట్ ఎ.రమణయ్య,రాజారావు తదితరులు పాల్గొన్నారు.










