Nov 11,2023 22:07

సమావేశంలో మాట్లాడుతున్న వేణురెడ్డి

       హిందూపురం : వైసిపి ఆధ్వర్యంలో జరుగుతున్న సామాజిక సాధికార బస్సు యాత్ర ఈ నెల 15న హిందూపురం పట్టణానికి వస్తుందని, ఇందులో వైసిపి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆ పార్టీ నాయకుడు వేణురెడ్డి కోరారు. శనివారం స్థానిక పార్టీ కార్యాలయంలో పట్టణంతో పాటు రూరల్‌ మండలాల వ్యాప్తంగా ఉన్న వైసిపి ప్రజాప్రతినిధులు, నాయకులు, ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా వేణురెడ్డి మాట్లాడుతూ 15న సాయంత్రం 4 గంటలకు పట్టణంలోని అంబేద్కర్‌ సర్కిల్‌లో బహిరంగ సభ ఉంటుందన్నారు. సభకు పార్టీ రాయలసీమ కో ఆర్డినేటర్‌, విద్యుత్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉప ముఖ్యమంత్రి అంజాద్‌ బాషా, సినీ నటులు అలీతో పాటు ఇతర ముఖ్య నాయకులు హాజరు అవుతారన్నారు. నియోజకవర్గంలోని వైసిపి నాయకులు అందరం కలిసి ఈ యాత్రను జయప్రదం చేద్దాం అని కోరారు. ఈ సమావేశంలో వైసిపి నాయకురాలు మధుమతి రెడ్డి, రాష్ట్ర సహాయ కార్యదర్శి కొటిపి హనుమంత రెడ్డి, మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ ఇంద్రజ, వైస్‌ ఛైర్మన్‌ జబీవుల్లా, మున్సిపల్‌ కౌన్సిలర్లు, జెసిఎస్‌ జిల్లా కో ఆర్టినేటర్‌ మారుతిరెడ్డి, పట్టణ ఏ బ్లాక్‌ కన్వీనర్‌ సాధిక్‌, హిందూపురం మండల కన్వీనర్‌ రాము, జడ్పిటిసి నాగభూషణప్పతో పాటు ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.