
ఈపూరు: వరికిపూడిశెల ప్రాజెక్టు నిర్మాణంతో పల్నాడు జిల్లా ప్రజల సాగు, తాగునీటి సమస్య పరిష్కారం అవుతుందని నరసరావుపేట ఎంపి శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. మం డలంలోని ఇనుమెళ్ళలో ఈపూరు పిఎసిఎస్ ఆధ్వర్యంలో రూ.40 లక్షలు నిధులతో 500 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల బహుళ ప్రయోజన సౌకర్య గోదామును ఎంపి, ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు శుక్రవారం ప్రారం భించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎంపి మాట్లాడుతూ రైతు ప్రయోజనాల దృష్ట్యా వారికి అందుబాటులో ఉండే విధంగా మండలంలో ఐదు గోదా ములు ఏర్పాటు చేయడం గొప్ప విషయమని అన్నారు. ప్రతి గ్రామాన్ని ఒక యూనిట్ గా తీసుకొని సచివాలయం, ఆర్బికే, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఏర్పాటు జరిగిందని, అదే మాదిరిగా మూడు గ్రామాలను ఒక యూనిట్ గా తీసుకొని గోదాములు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. గోదా ముల ద్వారా నాణ్యమైన ఎరువులు లభిస్తా యని, రైతు లందరూ ఈ గోదాములను సద్వినియోగం చేసుకోవాని సూచించారు. నవంబర్లో వరికపూడిశెల ప్రాజెక్టు నిర్మా ణానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేసేం దుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వాలు ఎటువంటి అనుమతులు లేకుండానే తూతూ మంత్రంగా శంకుస్థాపనలు చేశారని, తమ ప్రభుత్వం అన్ని అనుమతులు పొందాకే ప్రాజెక్టు నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. వినుకొండ- గుంటూరు నాలుగు వరుసల రహదారికి సంబంధించి డిపిఆర్ పనులు పూర్త య్యాయని, త్వరలో రోడ్డు పనులు ప్రారంభిస్తారని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ గ్రామంలో సుమారు రెండు కోట్ల రూపా యలతో అభివృద్ధి పనులు జరిగినట్లు చెప్పారు. వినుకొండ-నూజెండ్ల రోడ్డులో ఆర్యుబి నిర్మా ణానికి ఎంపి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డు చైర్మన్ చుండూరి వెంకటేశ్వర్లు,ఈపూరు పిఎసిఎస్ అధ్యక్షులు బొల్లా వెంకట రాధాకృష్ణ,పిఎసిఎస్ సెక్రటరీ పి.కోటేశ్వరరావు, వైసీపీ సీనియర్ నాయకులు జి. వెంకట హనుమయ్య, శాఖమూరి బుచ్చయ్య పాల్గొన్నారు.