Mar 21,2023 21:06

ప్రజాశక్తి - మొగల్తూరు
కొత్తపాలెంలో గొంతేరు డ్రెయిన్‌పై నిర్మిస్తున్న వంతెన పనులను మంగళవారం క్వాలిటీ కంట్రోల్‌ అధికారులు పరిశీలించారు. రూ.16.50 కోట్లతో వంతెన నిర్మాణ పనులు చేపట్టారు. విజిలెన్స్‌, క్వాలిటీ కంట్రోల్‌ ఇఇ ఎల్‌.ఏడుకొండలు, డిఇ ఎస్‌వి రమణ, జెఇ కె.ప్రసాద్‌రాజు, ప్రాజెక్ట్‌ డిఇ సూర్య కుమార్‌ పరిశీలించిన వారిలో ఉన్నారు.