
ప్రజాశక్తి-చిత్తూరు : "మహర్షి వాల్మీకి జయంతి" సందర్భంగా జడ్పీ ఆఫీస్ నందు అధికారులు వాల్మీకి మహర్షి చిత్ర పటానికి పూలమాలలు వేసి, పుష్పాలు వెదజల్లి, నివాళులు అర్పించారు. అనంతరం వాల్మీకి మహర్షి గురించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు జడ్పీ ఛైర్మన్ జి.శ్రీనివాసులు (వాసు), జడ్పీ సీఈఓ పి. ప్రభాకర రెడ్డి, జడ్పీ వైస్ ఛైర్ పర్సన్ కుమారి. ఆర్. రమ్య, జడ్పీ W&CW స్థాండింగ్ కమిటీ చైర్మన్ భారతి మధుకుమార్, తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రోగ్రాము నందు వీరితోపాటు పిఆర్.ఈఈ చంద్రశేఖర్ రెడ్డి, PIU EE రమణయ్య, సాతంబాకం ఎంపిటీసీ యశోద రెడ్డి, జీడీ నెల్లూరు నేతలు చిన్నమ రెడ్డి, వెంకట రెడ్డి, జడ్పీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.