Nov 15,2023 19:42

మాట్లాడుతున్న అధికారులు

మాట్లాడుతున్న అధికారులు
విద్యుత్‌ వినియోగదారులకు మెరుగైన సేవలు
ప్రజాశక్తి-కోవూరు:విద్యుత్‌ సేవలు సకాలంలో అందించడమే విద్యుత్‌ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక ప్రధాన కర్తవ్యమని ట్రాన్స్‌కో ఎగ్జిక్యూటీవ్‌ ఇంజినీర్‌ విజరుకుమార్‌రెడ్డి తెలిపారు. స్థానిక నేతాజీనగర్‌ లోని ఏపీఎస్పీడీసీఎల్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీరు కార్యాలయ ప్రాంగణంలో బుధవారం విద్యుత్‌ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వేదిక ప్రకారం ఏపీఈఆర్‌సి వారు నిర్దేశించిన ప్రకారం సేవలు నిర్వర్తించకుండా మిన్నకుండుట, అమలులో జాప్యం చేస్తే అటువంటి వాటిని నిశితంగా పరిశీలించి సంబంధిత విద్యుత్‌ వినియోగదారులకు సత్వరమే న్యాయం అందజేయడం జరుగుతుందన్నారు. ప్రధానంగా ట్రాన్స్‌ ఫార్మర్‌ మరమ్మతులు అయినా వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయకపోవడం, విద్యుత్‌ సరషరా నిలివేతకు కాలపరిమితి లేక పోవడం. విద్యుత్‌ ఓల్టేజీలో హెచ్చుతగ్గులు, విద్యుత్‌ వినియోగదారుల బిల్లుల్లో లోపాలు సరిచేయడం తదితర అంశాలపై ఈ ఫోరంకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే అటువంటి సమస్యల పరిష్కారానికి కషి చేయడం జరుగుతుందని తెలిపారు.
ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీరు టెక్నికల్‌ చంద్ర మాట్లాడుతూ మొత్తం బుధవారం నిర్వహించిన ఈ వేదికకు ఆరు ఫిర్యాదులు రావడం జరిగిందని, వాటిని నిశితంగా పరిశీలించి సకాలంలో పరిష్కరించేలా తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో వేదిక చైర్‌పర్సన్‌ వి. శ్రీనివాస ఆంజనేయమూర్తి, సభ్యులు కె. రామ్మోహన్‌ రావు, జి. ఈశ్వరమ్మ, డిఇలు సతీష్‌. శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు, ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీరు పరిధిలోని ఐదు మండలాల ఏఈలు, సిబ్బంది పాల్గొన్నారు.