వేలం జరుపుతున్న అధికారులు
ప్రజాశక్తి-చిన్నగొట్టిగల్లు:
ఈ వేలం పాటలో గతేడాది కంటే ఎక్కువ ఆదాయాన్ని పంచాయతీ అర్జించిందని కార్యదర్శి మదన్మోహన్ రాజు తెలిపారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో వారపుసంత 50,400, బస్టాండ్ 55,300, షాపులు 2,03,522లతో కలిపి, 09,222 రూపాయలు రాగా 2022-23కు వారపుసంత 84,000, బస్టాండ్ 64,500 షాపులు ద్వారా 2,52,000లతో కలిపి 4,00,500 రూపాయల ఆదాయం వచ్చిందని, గతేడాదితో పోల్చుకుంటే 91,278 రూపాయలు అధికంగా వేలంలో పంచాయతీకి ఆదాయంగా సమకూరిందన్నారు. ఈ కార్యక్రమంలో డిజటల్ అసిస్టెంట్ వెంకటేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.










