Nov 14,2023 21:01

     జంగారెడ్డిగూడెం:మండలంలోని గుర్వాయగూడెం మద్ది ఆంజనేయస్వామి ఆలయంలో కార్తీకమాసోత్సవాలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. చింతలపూడి ఎంఎల్‌ఎ విఆర్‌.ఎలిజా ఈ ఉత్సవాలను ప్రారంభించారు. అలాగే అన్నదాన కార్యక్రమాన్ని ఎంఎల్‌ఎ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అత్యంత వైభవంగా జరుగుతున్న మద్ది ఆంజనేయస్వామి ఆలయ కార్తీక మాసోత్సవాల్లో ప్రజలందరూ సంతోషంగా పాల్గొనాలని కోరారు. ఆలయానికి వచ్చే యాత్రికులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని, అవాంతరాలు లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆలయ సిబ్బందికి, ప్రభుత్వ శాఖ అధికారులకు ఎంఎల్‌ఎ సూచించారు. అలాగే ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన చలువ పందిళ్లు, తాగునీరు, ప్రాథమిక వైద్యం, భోజన వసతులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్య నిర్వహణాధికారి ఎ.కొండలరావు, గుర్వాయిగూడెం గ్రామ సర్పంచి గుబ్బల సత్యవేణి, మద్ది ఆలయ ధర్మకర్తల మండలి మాజీ ఛైర్మన్‌ సరిత విజయభాస్కర్‌ రెడ్డి, జెడ్‌పిటిసి సభ్యులు పోల్నాటి బాబ్జీ, వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు