Oct 31,2023 00:01

గ్రామ చిత్ర పటానికి వేసి చూపుతున్న అధికారులు

ప్రజాశక్తి-అనకాపల్లి : మండలంలోని గోపాలపురం, అక్కిరెడ్డిపాలెం గ్రామాల్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో సోషల్‌ మ్యాపింగ్‌ ద్వారా పనుల గుర్తింపు, ప్రణాళిక ప్రక్రియ గ్రామసభ జిల్లా నీటి యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో సోమవారం జరిగింది. ఈ సందర్భంగా ఎంపిపి గొర్లి సూరిబాబు మాట్లాడుతూ గ్రామంలో ఏయే పనులు గుర్తించి ఎలా చేయాలి, చెరువులు వాటర్‌ నిల్వ ఉండడానికి కొండల మీద ట్రంచుల ఏర్పాటు, ప్రతి ఖాళీ ప్రదేశంలో పచ్చని మొక్కలను పెంచడానికి ప్రణాళికను సిద్ధం చేయాలని సూచించారు. వేసిన మొక్కలను కాపాడేందుకు ఒక మనిషిని పెట్టి వాటి సంరక్షణ బాధ్యతలు అప్పచెప్పాలన్నారు. గ్రామ చిత్రపటాన్ని వేసి వాటి వివరాలను ఏపీవో, ఎంపీపీ వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ జెర్రిపోతుల లక్ష్మి, సాలాపు శాంతి సూరిప్పారావు, ఎన్‌ఆర్జిఎస్‌ ఏపీవో సుప్రియ, గ్రామ కార్యదర్శి గుణలక్ష్మి, వార్డు మెంబర్లు, ఓబీలు, వాలంటీర్లు, ప్రజలు పాల్గొన్నారు.