Oct 28,2023 23:45

మాట్లాడుతున్న మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి

ప్రజాశక్తి- సబ్బవరం
టీడీపీ, జనసేన ఉమ్మడి కార్యచరణతో నవంబర్‌ ఒకటో తేదీ నుంచి ప్రజల్లోకి వెళ్లనున్నట్లు మాజీ మంత్రి, టిడిపి పెందుర్తి నియోజకవర్గ ఇన్‌ఛార్జి బండారు సత్యనారాయణమూర్తి పేర్కొన్నారు. మండలంలోని ఇరువాడ జిఎస్‌ ఫంక్షన్‌ హాల్‌లో శనివారం జరిగిన పెందుర్తి నియోజకవర్గ టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ మన భవిష్యత్‌ చంద్రబాబు అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రానున్న ఎన్నికల్లో ఓట్లు చీలిపోకుండా చేసేందుకు టీడీపీ, జనసేన ఉమ్మడిగా నవంబర్‌ ఒకటి నుండి 45 రోజుల పాటు ఇంటింటికి వెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బండారు అప్పలనాయుడు, గండి రవికుమార్‌, మిడతాడ మహాలక్ష్మి నాయుడు, పీలా శ్రీనివాసరావు, వేగి పరమేశ్వరరావు, గండి ముత్యాలనాయుడు, పిబివిఎస్‌ఎన్‌ రాజు, కోటాన అప్పారావు, బర్ణికాన బాబురావు, వి.చిన్నారావు, బొండా సత్యారావు, రెడ్డి నారాయణరావు, మొల్లి ముత్యాల నాయుడు, దాసరి వెంకట రమణ, గొర్లి చైతన్య పాల్గొన్నారు.
వైసిపి గద్దె దిగడం ఖాయం
అనకాపల్లి : రానున్న ఎన్నికల్లో వైసిపి గద్దె దిగడం ఖాయమని మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ అన్నారు. స్థానిక విజయరామరాజు పేట మాధవ సదన్‌ హాల్లో శనివారం అనకాపల్లి పట్టణ తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఇందులో పీలా మాట్లాడుతూ జగన్‌ ప్రభుత్వం పట్ల రాష్ట్రంలో తీవ్రమైన వ్యతిరేకత ఉందన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు నీల బాబు, సురేంద్ర, రత్నకుమారి, పోలవరపు త్రినాధ్‌, బొద్దపు ప్రసాదు, ధనాల విష్ణు చౌదరి తదితరులు పాల్గొన్నారు.