
అటవీశాఖ ఉన్నతాధికారుల బృందం
ప్రజాశక్తి-గొలుగొండ:మండలంలో అటవీశాఖ భూముల్లో ఉన్న రంగురాళ్ల క్వారీ ప్రాంతాలను ఆదివారం అటవీశాఖ ఉన్నతాధికారుల బృందం పరిశీలించారు. స్క్వాడ్ డిఎఫ్ఓ సోమసుందర్, నర్సీపట్నం డిఎఫ్ఓ రాజారావులు మరి కొంతమంది ఉన్నతాధికారులతో కలిసి ముందుగా సాలిక మల్లవరం, కరక ఆరిలోవ అటవీ ప్రాంతంలో ఉన్న రంగురాళ్ల క్వారి ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా సోమసుందర్ మాట్లాడుతూ, రంగురాళ్ల క్వారి ప్రాంతాల్లో ఎటువంటి తవ్వకాలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తామన్నారు. ఎవరైనా తవ్వకాలు చేపడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం రేంజర్ లక్ష్మీనర్సు, సెక్షన్ అధికారి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.