Oct 28,2023 00:57

పల్నాడు జిల్లా: ప్రత్యేక సారాంశ సవరణ ప్రక్రియలో భాగంగా ఓటర్ల నమోదు, మార్పులు , చేర్పుల విషయంలో తప్పులు లేని జాబితా ఏర్పాటుకు రాజకీయ పార్టీల ప్రతినిదులు తమ వంతు సహకారం అందించాలని జిల్లా కలెక్టర్‌ ఎల్‌.శివ శంకర్‌ వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరారు. శుక్రవారం స్థానిక నరసరావుపేట కలెక్టర్‌ కార్యాలయం లోని ఎస్‌.ఆర్‌. శంకరన్‌ వీడియో కాన్ఫరెన్సు హాలులో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ డ్రాఫ్ట్‌ జాబితా విడుదల చేస్తామని, ఓటరు నమోదు కోసం ఫారం-6, తొలగిం పునకు ఫార్మ్‌- 7, సవరణల కోసం ఫారం-8 లలో దర ఖాస్తు చేసుకోవాలని సూచించారు. జాబితా ప్రక్రియ 26, డిసెంబర్‌- 2023 నాటికి పూర్తి కావాలని,రానున్న నూతన ఏడాది జనవరి 5 న తుది జాబితా విడుదల చేయనున్నట్లు చెప్పారు. ఓటరు నమోదు ప్రక్రియను బూత్‌ లెవల్‌ అధి కారుల ద్వారా విడుదల చేయాలని, డూప్లికేషన్‌ లేకుండా చూడాలన్నారు. సమావేశంలో జిల్లా రెవిన్యూ అధికారి వినాయకం, గుర్తింపుపొందిన 8 రాజకీయపార్టీల ప్రతి నిధులు పాల్గొన్నారు.

ప్రత్యేక అధికారులతో సమీక్ష
గ్రామోదయం/నగరోదయం కార్య క్రమంలో భాగంగా బంగారు తల్లి పథకం సమగ్ర అమలుకు, మధ్యాహ్న భోజన పథకంపై జిల్లా కలెక్టర్‌ ఎల్‌.శివశంకర్‌ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు.10 ఏళ్ల నుంచి 19 ఏళ్ల బాలికలు, యువత వరకు వరకు ఎనీ మియా బారీ నుండి రక్షణ పొందేందుకు, వారిలో ఉన్న రక్తహీనత శాతాన్ని తగ్గించే శాతం కార్యక్రమం బంగారు తల్లి గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణాల వరకు బాలికల్లోనూ, యువత లోనూ రక ్తహీనత శాతం తక్కువగా ఉండడం పల్నాడు జిల్లాలో అధి కంగా ఉందన్నారు. అన్ని శాఖల అధికారులు దీనిపై అన్ని ప్రభుత్వ పాఠశాలలు, వసతిగృహాలు, కళా శాలలు, ప్రత్యేక దృష్టి సారించి గ్రామీణ స్థాయిలో వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ, విద్యాశాఖ, పంచాయతీ రాజ్‌, అన్ని మున్సిపాలిటీలు, అన్ని శాఖల అధికారులతో ఈ సమస్య నివారణకు సమావేశం నిర్వహించారు. దీనిపై ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించి ప్రజల్లో చైతన్యం తీసుకురావా లన్నారు. పల్నాడు జిల్లా వ్యాప్తంగా చిన్నపిల్లల దగ్గర నుంచి యువత వరకు రక్తహీనత శాతాన్ని తగ్గించి, వారిలో రక్తహీనత పెంచేందుకు చైతన్య పరచాలన్నారు. అనతరం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంపై స్పందన అడిగి తెలుసు కున్నారు. అదేవిధముగా జగనన్నకు చెబుతాం లో వచ్చిన ఆర్జీలను సకాలంలో పరిష్కరించేలా చూడాలని సూచిం చారు. హౌసింగ్‌ స్టేజి కన్వర్షన్‌ పై సమీక్షించారు.