
ప్రజాశక్తి-నక్కపల్లి:మండలంలోని గొడిచెర్లలో శనివారం బాబుతో నేను కార్యక్రమం నిర్వహించారు. చంద్రబాబు పై పెట్టిన అక్రమ కేసులపపై నిరసన చేపట్టారు. కరపత్రాలను ఇంటింటికీ పంపిణీ చేశారు. గ్రామంలో క్లస్టర్ ఇన్చార్జి వైబోయిన రమణ ఆధ్వర్యంలో బూత్ కమిటీ కన్వీనర్ల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల శాఖ అధ్యక్షులు కొప్పిశెట్టి వెంకటేష్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అనకాపల్లి : చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ స్థానిక గవరపాలెం పార్క్ సెంటర్లో శనివారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు బుద్ధ నాగ జగదీశ్వరరావు మాట్లాడుతూ చంద్రబాబును రాజమండ్రి జైల్లోనే తుదముట్టించేందుకు జగన్రెడ్డి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. 50 రోజులుగా జైల్లోనే ఉన్న చంద్రబాబుకు అనారోగ్య సమస్యలు చుట్టుముట్టుతున్నా, ఆ విషయాన్ని బయట పెట్టకుండా అంతా బాగున్నట్టుగా డాక్టర్లపై ఒత్తిడి చేసి వాస్తవ రిపోర్టులను దాచిపెడుతున్నారని ఆరోపించారు. సకల శాఖామంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి దర్శకత్వంలోనే నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు బోడి వెంకట్రావు కుప్పిలి జగన్మోహన్, గుడాల సత్యనారాయణ, దాడి అప్పారావు పాల్గొన్నారు.