
మాచర్ల: వచ్చే వేసవిలో అసెంబ్లీ ఎన్నికలు జరగ నున్నా యని, ఆ సమయంలో తాగునీటి సమస్య రాకుండా ముందస్తు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కౌన్సిలర్ సుభాని అధికారులకు సూచించారు. మున్సి పల్ చైర్మన్ మాచర్ల చినఏసోబు అధ్యక్షతన మంగళ వారం కౌన్సిల్ హల్లో కౌన్సిల్ సమావేశం జరిగింది. సమావేశంలో పాల్గోన్న కౌన్సిలర్ సుభాని మాట్లాడుతూ ఇటీవల వాటర్ సరఫరాలో అంతరాయం వస్తే పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడిన ఘటనను గుర్తు చేశారు. మాచర్ల టౌన్కు మున్సిపాలిటీ అందించే నీటి సరఫరా కీలకమన్నారు. వేసవిలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నట్లు గుర్తు చేశారు. అదే సమయంలో నీటి ఎద్దడి తలెత్తితే పరిస్థితులు ఏంటి అని గుర్తు చేశారు. అధికారులు ప్రత్యేక శ్రద్దతో ముందుస్తుగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. మరో కౌన్సిలర్ మదార్ సాహేబ్ మాట్లాడుతూ ర్యాటి ఫికేషన్స్ ఆమోదించటం ఏంటి, సమావేశాలు పెట్టి ఆయా అంశాలపై చర్చించి మంచి నిర్ణయాలు తీసు కోవచ్చునని సూచించారు. తన వార్డులో పనులు చేయని కాంట్రాక్టర్కు ప్రస్తుత ఎజెం డాలో మరి కోన్ని పనులు అప్పగిస్తున్నట్లు ఉందన్నారు. తమ వార్డులో తీసుకున్న పనులు పూర్తి చేసిన తరువాత అతనికి ఇతర పనులు అప్పగించాలని కోరారు. వైస్ చైర్మన్ పోలూరి నరసింహరావు మాట్లాడుతూ కోతుల సమస్యపై అధికారులు పట్టించుకోవాలన్నారు. పబ్లిక్ టారు లెట్స్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. నీటి సమస్య రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పట్టణంలో డబుల్ ట్యాప్ కనక్షన్స్ ఉన్నట్లు బిల్లులు వస్తున్నాయని వాటిని సరిచేయాలన్నారు. మరో కౌన్సి లర్ గట్ల అరుణకుమారి మాట్లా డుతూ తమ వార్డులో లో ఓల్టేజి సమస్యను నివారిం చాలన్నారు. లే ఆవుట్స్లో నిర్మాణాలకు అంతరాయం లేకుండా వాటర్ సరఫరా చేయాలన్నారు. కౌన్సిలర్ సుభాని మాట్లాడుతూ కుక్కల సమస్య కూడ తమ వార్డులో ఉందన్నారు. స్పందించాలని అధికారు లను కోరారు.
లయన్స్ క్లబ్ వారు నిలిపి వేసిన వాటర్ ప్లాం ట్ను పునరుద్ధరణ చేసి తమ ప్రాంతంలో తాగునీటి సౌకర్యం కల్పించాలన్నారు. మున్సిపల్ చైర్మన్ మాచర్ల చినఏసోబు, కమిషనర్ ఇవి రమణబాబులు మాట్లా డుతూ మంచి నీటి సమస్యపై ప్రత్యేక శ్రద్దతో పని చేస్తున్నట్లు వివరించారు. పట్టణంలోని 19 లే ఆవుట్స్ కాలనీలకు ఆర్చిల నిర్మాణానికి నిధులు మంజూరైనట్లు తెలిపారు. సమావేశంలో డిఇ మధుసూదన్రావు, ఎఇలు ఎ.ఆదిత్య, జాన్శ్యామూల్, ఆర్ఐ వెంగయ్య తదితరులు పాల్గొన్నారు.