Nov 01,2023 01:09


సమావేశంలో 2వ వార్డు కౌన్సిలర్‌
పిడుగురాళ్ళ : కొన్ని వార్డులలో తాగునీరు సరిగా రావడం లేదని, ఒకవేళ వచ్చినా తాగునీరు వాసన వస్తున్నాయని, పరిశుభ్రమైన నీటిని సరఫరా చేయాలని 2వవార్డు మున్సిపల్‌ కౌన్సిలర్‌ క్కొక్కొర శ్రీను అన్నారు. మంగళవారం పట్ట ణంలోని మున్సిపల్‌ కార్యలయంలో కౌన్సిల్‌ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మున్సిపల్‌ కమిషనర్‌ వెంకటేశ్వర్లు అజెండాలోని అంశాలను కౌన్సిల్‌ సభ్యులకు చదివి వినిపించారు. అనంతరం కౌన్సిలర్‌ క్కొక్కొర శ్రీను మాట్లడుతూ నీటి పన్ను వసూలు చేస్తున్న విషయాన్ని ప్రస్తావించారు. తాగునీరు, ప్రధాన రహదారిపై పూర్తి చేయాల్సిన రోడ్డు నిర్మాణం గురించి చర్చించారు. పట్టణంలోని ఇంటర్‌నెట్‌, కేబుల్‌ నెటవర్క్‌ వాళ్ళు విద్యుత్‌ స్ధంబాలపై ఇష్టానుసారంగా కేబుల్స్‌ ఏర్పాటు చేస్తున్నారని దీనివల్ల మున్సిపల్‌టికి సంభందించిన విద్యుదీపాలు, విద్యుత్‌ తీగలు పాడైపోతున్నాయని తెలిపారు. దీనిపై కమిషనర్‌ వెంకటేశ్వర్లు మాట్లడూతూ నీరు డెడ్‌ స్టోరేజ్‌లో ఉన్నందున నీటి సరఫరాలో ఇబ్బందులు వచ్చాయని, కొత్తగా ఏర్పాటు చేసిన పైపు లైన్లు కాబట్టి నీరు కొద్దికాలం పాటు వాసన వస్తాయని తెలిపారు. నీటిలో క్లొరిన్‌ కలుపుతున్నామని,ప్యూరిపైర్‌ చేసి మంచినీరు సరఫరా చేస్తున్నామని అన్నారు. ప్రధాన రహదారి విషయంపై సంభదిత కాంట్రాక్ట్‌ర్‌ను సంప్ర దించామని మరో వారంలో ప్రధాన రహదారి నిర్మాణాన్ని ప్రారంభించి పూర్తి చేస్తామని చెప్పారు. మున్సిపల్‌ స్ధంభాలపై కేబుల్‌, ఇతరులు వేస్తున్న తీగల గురించి గతంలో కూడ చర్చలు జరిగాయని, ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా ఉందని అన్నారు. ఈ విషయం మన మున్సిపాలిటికి చెందిన విషయం కాదని రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయమని తెలియజేశారు.9వ వార్డు కౌన్సిలర్‌ మాదాల కిరణ్‌ మాట్లడుతూ పట్టణంలో కోతులు,కుక్కల బెడద ఎక్కువుగా ఉందని ఫాఠశాలల వద్ద పిల్లలకి చాలా ఇబ్బం దిగా ఉంటుందని ప్రజలపై దాడులు చేస్తున్నాయని సమస్య తీవ్రంగా ఉందని వెంటనే పరిష్క రించాలని తెలియజేశారు పట్టణంలోని గంగమ్మగుడి, అంజిరెడ్డి వైద్యశాల వద్ద ప్రధాన రహదారికి అప్రోచ్‌ రోడ్డ ఏర్పాటు చేయాలని కోరారు.స్పందించిన కమిషనర్‌ పట్టణంలో కోతులు,కుక్కల బెడద ఎక్కువుగా ఉన్న విషయం తమ దృష్టికి వచ్చిందని త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. కుక్కలను పట్టుకుని అవి కరవకుండా లేదా కరిచినా ర్యాబిస్‌ వ్యాధి రాకుండా ఇంజక్షన్‌లు మాత్రం ఇవ్వగలమని తెలిపారు. అజెండాలోని అంశాలను మున్సిపల్‌ చైర్మన్‌ సుబ్బారావు , కౌన్సిల్‌ సభ్యులు అమోదించారు.