Oct 16,2023 00:55

ఖో ఖో ఆడుతున్న క్రీడాకారులు

ప్రజాశక్తి -పాయకరావుపేట:విద్యార్థులకు క్రీడలు మానసిక, శారీరక దృఢత్వానికి దోహదపడతాయని శ్రీ ప్రకాష్‌ విద్యా సంస్థల సంయుక్త కార్యదర్శి విజరు ప్రకాష్‌ తెలిపారు. స్థానిక శ్రీ ప్రకాష్‌ విద్యా సంస్థలలో సిబిఎస్‌ఇ 7 ఖో ఖో పోటీలకు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణా నుండి సుమారు 1200 మంది క్రీడాకారులతో ఘనంగా ప్రారంభ మయ్యాయి. ఈ పోటీలు బాలుర, బాలికల విభాగంలో అండర్‌ 19 కేటగిరీ లో మూడు రోజుల పాటు జరగనున్నాయని విద్యా సంస్థల సీనియర్‌ ప్రిన్సిపల్‌ ఎం.వి.వి.ఎస్‌ మూర్తి తెలిపారు. 17న గెలుపొందిన వారికి బహుమతి ప్రధానం జరుగుతుందని అయన తెలిపారు. ప్రారంభ మ్యాచ్‌ బాలికల విభాగంలో ఫోర్ట్‌ సిటీ స్కూల్‌ ( విజయనగరం) విజయం సాధించింది. పలు మ్చాచ్‌లలో వివిధ స్కూళ్లు విజయం సాధించాయి. ఈ కార్యక్రమంలో సీబీఎస్‌ఈ అబ్జర్వర్‌ జి.శ్రీనివాసరెడ్డి, వైస్‌ ప్రిన్సిపల్‌ అపర్ణ, నీళాదేవి పాల్గొన్నారు.