
సత్తెనపల్లి రూరల్: జనసేన పార్టీ నాయ నాయకులు బొర్రా వెం కట అప్పారావు చేపట్టిన జనసేన-టిడిపి సంకీర్ణ ప్రభుత్వ సంకల్ప యాత్రను పోలీసులు అడ్డు కున్నారు. సత్తెనపల్లి మండలం గర్నెపూడిలో సంకల్ప యాత్రను బుధవారం ప్రారంభించారు. సత్తెనపల్లి నియోజకవర్గ టిడిపి ఇన్ఛార్జి కన్నా లక్ష్మీనారాయణ జెండా ఊపి యాత్రను ప్రారం భించారు. సంకల్ప యాత్రకు ఎలాంటి అనుమతి లేదంటూ రూరల్ పోలీసులు బొర్రా వెంకట అప్పారావును అడ్డుకున్నారు. జనసేన , టిడిపి నేతలు పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. అప్పారావును అదుపులోకి తీసు కున్నారు. దీంతో జనసేన టిడిపి నాయకులు పెదమక్కెన- గర్నెపూడి రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. పోలీస్ వాహనాన్ని అడ్డుకున్నారు. తక్షణం ఆయనను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మంత్రి అంబటి రాంబాబు, సిఎం జగ న్మోహన్ రెడ్డి కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళన చేస్తున్న జనసేన టిడిపి నేతలను చెదర కొట్టారు. సంకల్ప యాత్ర ప్రచార రథాన్ని సీజ్ చేసి పోలీస్టేషన్కు తరలించారు. ముందుగా ఎన్టీఆర్, కోడెల శివప్రసాద్ విగ్రహాలకు పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. యాత్రలో జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి కె.సాంబశివ రావు, కౌన్సిలర్ ఆర్.సుమన్, జనసేన రాజు పాలెం మండల పార్టీ అధ్యక్షులు టి.నర్సయ్య టిడిపి మండల పార్టీ అధ్యక్షులు ఎ. అమరేశ్వరరావు, టిడిపి నేతలు వై. వెంకటేశ్వర రావు, జి.అప్పారావు, ఎం.రామచంద్రరావు , ఎం.సాంబశివరావు పాల్గొన్నారు.