
ప్రజాశక్తి - చింతలపూడి
సమాజంలో జర్నలిజం అనేది ప్రముఖమైనదని, గ్రామీణ స్థాయిలో సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చేది జర్నలిస్టులేనని చింతలపూడి సిఐ మల్లేశ్వరావు తెలిపారు. మండలంలో ఎంపిడిఒ కార్యాలయం వద్ద జాతీయ పత్రిక దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో జర్నలిజం అంటే ఫ్యాషన్తో వచ్చేవారు, ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉన్నాయని వాటిని మార్చి సమస్యలను వెలుగులోకి తీసుకురావాలని తెలిపారు. వార్తల విషయంలో నిజానిజాలు నిర్థారణ చేయకుండా రాయటంతో నిజమైన బాధితులకు అన్యాయం జరుగుతుందన్నారు. ఒక వార్త రాసేటప్పుడు వాస్తవాలను పరిగణలోకి తీసుకురావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ ఆజాద్, స్వర్ణపతక గ్రహీత మల్లెల జయరాజు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులు పాల్గొన్నారు.