
ప్రజాశక్తి - ఏలూరు అర్బన్
దేశ ప్రజల సమస్యల పరిష్కారం కోసం, సమగ్ర అభివృద్ధికి సిపిఎం ప్రజా రక్షణభేరి చేపట్టిందని పార్టీ జిల్లా కార్యదర్శి ఎ.రవి అన్నారు. బుధవారం విజయవాడలో జరిగిన బహిరంగ సభకు ఏలూరు నుండి బయలుదేరిన వాహనాలను రవి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్టీ ఏలూరు కార్యదర్శి పి.కిషోర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రవి మాట్లాడుతూ రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీలు రాష్ట్రాభివృద్ధికి కాకుండా, తమ అవినీతి కేసుల నుండి బయటపడేందుకు బిజెపికి సాగిలపడుతున్నాయన్నారు. దీంతో రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిందన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు, విభజన హామీల అమలు, వెనుకబడిన ప్రాంతాలకు నిధులు విడుదల ఇలా అనేక అంశాల్లో మోసం చేసిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో నాయకులు బి.సోమయ్య, పి.ఆదిశేషు, ఎ.శ్యామలారాణి, వి.సాయిబాబు, ప్రసాద్, గోపి, మావూరి శ్రీనివాసరావు, ఇస్సాక్, కట్టా సత్యనారాయణ పాల్గొన్నారు.
చింతలపూడి : విజయవాడ ప్రజారక్షణ భేరి సభకు మండలం నుండి సిఐటియు ఆధ్వర్యంలో కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. ఈ వాహనాలను సిఐటియు మండల అధ్యక్షులు నత్త వెంకటేశ్వర్లు జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కన్వీనర్ రామిశెట్టి సత్యనారాయణ, అంగన్వాడీలు, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
పోలవరం : సిపిఎం ప్రజా రక్షణ బేరి బహిరంగ సభకు మండలం నుంచి 200 మంది తరలివెళ్లారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి గుడెల్లి వెంకట్రావు మాట్లాడారు. సభకు వెళ్లినవారిలో బొరగం భూచంద్రరావు, సముద్రాల సాయికృష్ణ, ప్రాజెక్టు కార్యదర్శి పిఎల్ఎస్.కుమారి, అంగన్వాడీలు, హెల్పర్లు, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
కలిదిండి: మండలంలోని నలుమూలల ప్రజారక్షణ భేరి సభకు వివిధ వాహనాల్లో ప్రజలు తరలివెళ్లారు. పెదలంక, తాడినాడ, కలిదిండి, కోరుకొల్లు గ్రామాల నుండి సిపిఎం మండల కార్యదర్శి శేషపు మహంకాళిరావు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లారు.
నూజివీడు రూరల్ : సిపిఎం ప్రజా రక్షణ భేరి బహిరంగ సభకు మండలం నుంచి నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు జి.రాజు, ఎన్ఆర్.హనుమాన్లు, దుర్గారావు, వసంతరావు, నాగరాజు, పద్మాంజ పాల్గొన్నారు.
జీలుగుమిల్లి : ప్రజా రక్షణభేరి బహిరంగ సభకు మండలం నుంచి నాయకులు, కార్యకర్తలు భారీగా తరలి వెళ్లినట్లు పార్టీ మండలకార్యదర్శి తెల్లం దుర్గారావు తెలిపారు. వాహనాలను దుర్గారావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కారం దుర్గ, నేలటూరి అప్పారావు, కొండలరావు, కల్లూరి దావీదు, గుండు గంగరాజు ఉన్నారు.
కొయ్యలగూడెం : ప్రజారక్షణ భేరి మహాసభకు బయలుదేరిన వాహనాలను సిపిఎం మండల కార్యదర్శి శుక్లబోయిన రాంబాబు జెండా ఊపి ప్రారంభించారు.
భీమడోలు : సిపిఎం ప్రజా రక్షణభేరి సభకు భీమడోలు, ద్వారకాతిరుమల మండలాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు వివిధ వాహనాల్లో తరలి వెళ్లారని పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్.లింగరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు కట్టా భాస్కరరావు, నాగరాజు పాల్గొన్నారు.
జంగారెడ్డిగూడెం : రక్షణ భేరి బహిరంగ సభకు సిపిఎం నేతలు, ప్రజా సంఘాలు నాయకులు పట్టణం, మండలం నుంచి అధిక సంఖ్యలో తరలి వెళ్లారు. విజయవాడకు బయలుదేరిన వాహనాలను సిపిఎం మండల కార్యదర్శి ఎం.జీవరత్నం, జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు అందుగుల ప్రభాకర్రావు, జి.రాంబాబు, యాగంటి సీత, జోడే సూర్యచంద్రరావు, పట్టణ కన్వీనర్ పసల సూర్యారావు, కమిటీ సభ్యులు ఎస్కె.సుభాషిణి పాల్గొన్నారు.
టి.నరసాపురం : సిపిఎం ప్రజా రక్షణ భేరి బహిరంగసభకు మండలం నుండి సిపిఎం నాయకులు పెద్దఎత్తున తరలివెళ్లారు. సిపిఎం మండల కార్యదర్శి అనుమోలు మురళీ ఆధ్వర్యంలో మండలంలోని అల్లూరి సీతారామరాజునగర్, రామమ్మగూడెం తదితర గ్రామాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో వాహనాలపై వెళ్లినట్లు ఆయన తెలిపారు. వెళ్లిన వారిలో మడకం కుమారి, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
బుట్టాయగూడెం : మండలం నుండి సిపిఎం నాయకులు, కార్యకర్తలు, గిరిజనులు పెద్దఎత్తున తరలివెళ్లారు. అంతర్వేదిగూడెం, మేరకగూడెం, చీమలవారిగూడెం, ఇప్పలపాడు, బుట్టాయగూడెం, జైనవారిగూడెం, అచ్చాయపాలెం, కంసాలకుంట, రేగులకుంట, రెడ్డిగణపవరం, నూతిరామన్నపాలెం, దొరమామిడి, ఇలా మండలంలోని 23 గ్రామల్లోని సిపిఎం కార్యకర్తలు, అభిమానులు, గిరిజనులు 22 వాహనాల్లో విజయవాడలో జరిగే ప్రజారక్షణభేరి సభకు మండల కార్యదర్శి తెల్లం రామకృష్ణ ఆధ్యర్వంలో వివిధ వాహనాల్లో తరలివెళ్ళారు.