
సత్తెనపల్లి: బిజెపి అనుసరిస్తున్న కార్పొరేట్ కమ్యూనల్, విధానాలను నిరసిస్తూ ప్రత్యామ్నాయంగా సిపిఎం ప్రజల ముందు ఉంచుతున్న ప్రణాళికకు మద్దతు తెలపాలని సిపిఎం సత్తెన పల్లి మండలం కార్యదర్శి పెండ్యాల మహేష్ విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి విడిపోయిన తర్వాత మన రాష్ట్రానికి అలాగే, పల్నాడు జిల్లాకు కూడా వ్యవ సాయమే ప్రధాన జీవనాధారమని అన్నారు. అటువంటి వ్యవసాయం తీవ్రమైన సంక్షోభంలో ఉన్నప్పటికీ పాలకులు పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. పల్నాడు జిల్లాలో గత సం వత్సరం కూడా లక్షన్నర ఎకరాలు సాగు భూమి బీడుగా మారిందని, కేవలం పంటలు గిట్టుబాటు కానందున, ఈ సంవత్సరం వర్షాలు అననుకూల వాతా వరణంతో సగం పైర్లు అసలు వేయ లేదని, వేసిన భూమిలో కూడా పైర్లు ఎండి పోతున్నాయని అన్నారు. సిపిఎం ప్రజల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని 30 డిమాండ్లను రూపొందించి, ఆ డిమాం డ్లను సాధించటం కోసమే బిజెపికి వ్యతిరేకంగా విశాల శక్తులను ఏకం చేయడానికి కృషి చేస్తోందని అన్నారు. నవంబర్ 15న విజయవాడలో జరిగే బహిరంగ సభను జయప్రదం చేయా లని కోరారు. కార్యక్రమంలో సిపిఎం కమిటీ సభ్యులు వి. తులసి రామ్, ఎం.నరసింహారావు, సిహెచ్ లక్ష్మీ నారాయణ, బి.రామారావు, జె భగత్, మేరిమ్మ, అనూష పాల్గొన్నారు.