సిఎం చేతుల మీదుగా అవార్డు అందుకున్న డీఎస్పీ
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్: పోలీస్ శాఖలో విశిష్ట సేవలకు పలమనేరు డిఎస్పీ ఎన్.సుధాకర్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రెసిడెంట్ మెడల్ను అందుకున్నారు. మంగళవారం విజయవాడలో జరిగిన 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా పలమనేర్ డీఎస్పీ ఎన్.సుధాకర్ రెడ్డి ప్రెసిడెంట్ మెడల్ను అందుకున్నారు.










