Oct 25,2023 23:54

మాట్లాడుతున్న డీఎస్పీ ఆదినారాయణ

ప్రజాశక్తి - సత్తెనపల్లి రూరల్‌ : రాజకీయ పార్టీలు సభలు, సమావేశాలు పాదయాత్రలకు పోలీసుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని సత్తెనపల్లి డీఎస్పీ బి.ఆదినారాయణ అన్నారు. సత్తెనపల్లి పోలీస్‌స్టేషన్‌లో బుధవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. పోలీసుల అనుమతి లేకుండా రాజకీయ పార్టీలు ఎలాంటి కార్యక్రమాలూ నిర్వహించకూడదని అన్నారు. 30 యాక్ట్‌ ప్రకారం పోలీసుల అనుమతి తీసుకుంటే, వారి కావాల్సిన బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. రాజకీయ సభలకు వెళ్లే ట్రావెల్స్‌ వాహనదారులు పోలీస్‌ అనుమతులు తీసుకోవాలని చెప్పారు. పోలీసుల అనుమతులు లేకుండా పాదయాత్రలు, సభలు, సమావేశాలు నిర్వహిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సభలు సమావేశాల్లో బాణాసంచా నిషేధమన్నారు.