
ప్రజాశక్తి - మండవల్లి
సౌత్ ఇండియా ఇంటర్ మహిళా కబడ్డీ పోటీలకు లింగాల విద్యార్థిని చందుసాయిభవాని ఎంపికైన ట్లు లింగాల పిఇటి వేణుబాబు తెలిపారు. ప్రకాశం జిల్లాలో నిర్వహించిన జెఎన్టియుకె కాకినాడ యూనివర్సిటీ మహి ళా కబడ్డీ సెలక్షన్లో సాయిభవాని అత్యుత్తమ కబడ్డీ ఆటను కనబరిచి జెఎన్టియుకె యూనివర్సిటీ జట్టుకు ఎంపికైందని తెలిపారు. భవాని నవంబర్ 23, 24, 25 తేదీల్లో తమిళనాడులో జరిగే సౌత్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ కబడ్డీ పోటీల్లో పాల్గొంటుందని తెలిపారు. ఈ సందర్భంగా భవానిని, పాఠశాల ప్రధానోపాధ్యా యు లును, ఉపాధ్యా యులును గ్రామానికి చెందిన ప్రముఖులు, తల్లిదండ్రులు అభినందించారు. కబడ్డీలో రాణించి లింగాల గ్రామానికి కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని పలువురు కోరారు.