Oct 13,2023 00:19

విరిగి పోయిన కుర్చీలు

ప్రజాశక్తి-గొలుగొండ:మండలంలోని ఏజెన్సీ ముఖ ద్వారం కేడిపేట ఆర్టీసీ కాంప్లెక్స్‌లో సౌకర్యాలు లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. తాగునీరు సౌకర్యం లేదు. కనీసం ఫ్యాన్లు కూడా ఏర్పాటు చేయలేదు. బస్సుల రాకపోకల సమయాలను తెలిపే సిబ్బంది లేరు. వర్షాలు పడితే కాంప్లెక్స్‌ ఆవరణలోకి అడుగు పెట్టే పరిస్థితి లేదు. కాంప్లెక్స్‌ లో కుర్చీలు విరిగిపోతే మరమ్మత్తు చేసే నాధుడే లేడు. ఇన్ని సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ఈ కాంప్లెక్స్‌లో తగు సౌకర్యాలు సంబంధిత అధికారులు కల్పించాలని ప్రయాణీకులు కోరుతున్నారు.