Mar 28,2022 22:58

నినదిస్తున్న కార్మిక సంఘాల నేతలు


ప్రజాశక్తి-శ్రీకాళహస్తి
కార్మిక, ఉద్యోగ చట్టాలను నీరుగార్చి దేశాన్ని కార్పోరేట్లకు అమ్మేయాలని చూస్తున్న మోదీ ప్రభుత్వం మొడలు వంచాలని సీఐటీయూ జిల్లా నాయకులు అంగేరి పుల్లయ్య పిలుపునిచ్చారు. రెండోరోజు సమ్మెలో కూడా ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు జనమాల గురవయ్య, వైఎస్‌ మణి, మోహన్‌రెడ్డి, మల్లి, సీఐటీయూ నాయకులు పెనగడం గురవయ్య, వెంకటేష్‌, గంధం మణి, ఈశ్వరయ్య, కుప్పమ్మ, కుమార్‌, భారతి, సౌజన్య, పుష్ప తదితరులు పాల్గొన్నారు.