Oct 18,2020 08:03

ఏ కులమైనా, తెగ అయినా, మతమైనా ఏ పక్షంలో ఉంటామన్నదే ముఖ్యం. ఎన్ని విభేదాలున్నా మిత్రులంతా ఒక వైపు నిలబడితేనే సామాజిక న్యాయాన్ని సాధించగలం. నేటి సంక్షోభకాలంలో పాలకపక్షాలు ప్రజల్ని చీల్చడానికి కొత్త ఎత్తుగడలతో ముందుకొస్తారు. వాటిని ఎదుర్కొని అణగారిని కులాలు, జాతులు, మతాలు ముందుకు పోవాలి. అన్ని మతాలు, కులాలు, జాతుల్లోని పీడిత, తాడిత ప్రజానీకమంతా ఏకమైతేనే సమసమాజాన్ని, సామాజిక న్యాయాన్ని సాధించగలం. అదే వందేళ్ల కమ్యూనిస్టు ఉద్యమం నేర్పిన పాఠం.