
తహశీల్దార్ కార్యాలయానికి ప్రదర్శనగా వెళ్తున్న నాయకులు, రైతులు
ప్రజాశక్తి- పెదకూరపాడు : అమరావతి మేజర్కు సాగునీటిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ టిడిపి ఆధ్వర్యంలో బుధవారం నియోజకవర్గ కేంద్రమైన పెదకూరపాడులో ప్రదర్శన చేపట్టారు. స్థానిక కచేరి సెంటర్ నుండి తహశీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ ర్యాలీ అనంతరం తహశీల్దార్ జియా, నీటిపారుదల శాఖ వర్క్ ఇన్స్పెక్టర్కు వినతిపత్రాలు ఇచ్చారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఆరుతడి పంటలకు ఇవ్వడానికి సరిపడా నీరు నాగార్జునసాగర్లో ఉన్నాయని, పంటలను కాపాడేందుకు ప్రభుత్వం ప్రణాళికను రూపొందించి రైతులను ఆదుకోవాలని కోరారు. ఇప్పుడు నీరివ్వకుంటే పైర్లు ఎండిపోతాయని చెప్పారు. కార్యక్రమంలో బి.ఆంజనేయులు, కె.వసంతరావు, బి.వెంకటేశ్వరరావు, వెంకట్రావు, రైతులు పాల్గొన్నారు.